Find Articles

ఇరుముడి’ జోష్‌లో రవితేజ… హారర్ కామెడీతో పాటు క్రేజీ మల్టీస్టారర్‌కి సై!

బాక్సాఫీస్ వద్ద ఇరుముడి చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ, తన తదుపరి సినిమాల విషయంలో వేగం పెంచారు. ఈ సారి రూట్ మార్చి ప్రేక్షకులు ఊహించని సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా వరుసగా రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టారు.

వివేక్ ఆత్రేయతో తొలిసారి హారర్ కామెడీ!

రవితేజ తన కెరీర్‌లో ఇప్పటివరకు టచ్ చేయని వినూత్న జోనర్‌ను ఎంచుకున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చెప్పిన ఒక డిఫరెంట్ హారర్ కామెడీ లైన్ నచ్చడంతో వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దిల్ రాజు మాజీ భాగస్వామి లక్ష్మణ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ మార్క్ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ మార్క్ స్క్రీన్ ప్లే తోడైతే బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని భావిస్తున్నారు.

శ్రీవిష్ణుతో మల్టీస్టారర్.. 2027 సంక్రాంతి టార్గెట్!

మరోవైపు, ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ ఫేమ్ హసిత్ గోలీ దర్శకత్వంలో రవితేజ మరో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ఓకే చెప్పారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో యంగ్ హీరో శ్రీవిష్ణు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు హారర్ కామెడీ, మరోవైపు వినోదాత్మక మల్టీస్టారర్‌తో రవితేజ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి!

Keerthi