సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ను ముందుకు తీసుకెళ్లేందుకు ఘట్టమనేని కాంపౌండ్ నుంచి మరో కొత్త హీరో వెండితెరకు పరిచయమవుతున్నారు. ఆయనే జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni). డైనమిక్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయన నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). పి. కిరణ్ నిర్మాణం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. జులై 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో జయకృష్ణ విలేకరులతో ముచ్చటించి పలు విశేషాలు పంచుకున్నారు.